May 02, 2019

ఇంటర్మీడియట్‌ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్నదే అయినా పెద్ద జీతాలిచ్చే కొన్ని ఉద్యోగాల్లో చేరవచ్చు.

ఉద్యోగాలు

ఈ కొలువులకు ఇంటర్‌ చాలు!
ఇంటర్మీడియట్‌ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్నదే అయినా పెద్ద జీతాలిచ్చే కొన్ని ఉద్యోగాల్లో చేరవచ్చు. అంతేకాదు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు కొలువులను ఇచ్చే అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు త్రివిధ దళాలు, ఇంకా ఎన్నో సంస్థలు ప్రకటించే పోస్టుల భర్తీకి పోటీపడవచ్చు.
ఇంటర్మీడియట్‌ అర్హత సాధించిన వారికి కొన్ని రకాల ఉద్యోగాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సొంత ఖర్చు లేకుండా ఉన్నత చదువులు, కొలువులు అందించే మార్గాలూ ఎదురు చూస్తున్నాయి. ఆ అవకాశాలను అందుకొని యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీలు నిర్వహించే పరీక్షలతో కేంద్రప్రభుత్వ విభాగాల్లో చేరవచ్చు. రాష్ట్రస్థాయిలో కానిస్టేబుల్, వీఆర్వో, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ప్రకటించే పలు పోస్టుల పరీక్షలకు హాజరుకావచ్చు.
యూపీఎస్‌సీ: ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ 
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్షను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇంటర్‌ అర్హతతో లభించే ఉన్నతస్థాయి ఉద్యోగం ఇదే. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లలో ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీసీ విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ అన్ని విభాగాలకూ అర్హులు.
ఆర్మీకి ఎంపికైతే బీఎస్సీ/బీఏ; నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో చేరితే బీటెక్‌ కోర్సులను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), పుణెలో అభ్యసిస్తూ, శిక్షణ పొందుతారు. నేవల్‌ అకాడమీ(ఎన్‌ఏ)లో చేరితే ఎజిమాలలో బీటెక్‌ చదువుతోపాటు శిక్షణ అందిస్తారు. వీరందరికీ జేఎన్‌యూ, న్యూదిల్లీ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది. అనంతరం ఆయా విభాగాలవారీ సంబంధిత కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌/ సబ్‌ లెఫ్టినెంట్‌ / ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ ఫోర్స్‌ల్లోకి తీసుకుంటారు. ఈ పరీక్ష ద్వారా ఎయిర్‌ ఫోర్స్‌లో చేరినవారు పైలట్‌గా సేవలు అందించవచ్చు. బాలురు మాత్రమే అర్హులు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ప్రకటన ఏటా రెండుసార్లు వెలువడుతుంది. ఈ సంవత్సరం రెండో నోటిఫికేషన్‌ ఆగస్టులో వస్తుంది.
రాష్ట్ర స్థాయిలో... 
వీఆర్వో: విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో) ఉద్యోగానికి ఇంటర్‌ విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టును రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీచేస్తాయి. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ప్రకటనలు వెలువడతాయి.
స్టేట్‌ పోలీస్‌: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్‌ పోస్టులను ఇంటర్‌ అర్హతతో భర్తీ చేస్తుంది. వీటిలో వివిధ విభాగాల్లో పోలీస్‌ ఉద్యోగాలతోపాటు, జైళ్ల శాఖలో వార్డర్స్‌...మొదలైన పోస్టులుంటాయి. మొదట ప్రిలిమ్స్‌ నిర్వహించి ఇందులో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. చివరగా మెయిన్స్‌ నిర్వహించి అందులో పొందిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆయా రాష్ట్రాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఈ ప్రకటనలు విడుదలచేస్తాయి.
ఎఫ్‌బీవో, ఏబీవో: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో), అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఏబీవో) పోస్టులను రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఇంటర్‌ అర్హతతో భర్తీచేస్తాయి. రాతపరీక్షతో పాటు నడకలో అభ్యర్థి ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తారు. కనీస ఎత్తు తప్పనిసరి. 
ఎస్‌ఎస్‌సీ: సీహెచ్‌ఎస్‌ఎల్‌ 
కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష ద్వారా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులను సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేస్తారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలకు మాత్రం మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ స్ట్రీమ్‌లో ఇంటర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. మిగతా పోస్టులకు ఏ గ్రూప్‌ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-27 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడు అంచెల్లో జరిగే పరీక్షల ద్వారా ఉంటుంది. సాధారణంగా ఏటా డిసెంబర్‌ లేదా జనవరిల్లో ప్రకటన వెలువడుతుంది.
ఎంపీసీ అభ్యర్థులకు ఎన్నో అవకాశాలు 
ఆర్మీలో 
10+2 టెక్నికల్‌ ఎంట్రీ: ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో అర్హత సాధించాలి.. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి బీటెక్‌తో పాటు శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి.
సోల్జర్‌ టెక్‌: ఈ ఉద్యోగానికి ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తప్పనిసరి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి. 17 1/2 - 23 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ టెస్టు, రాతపరీక్ష, వైద్యపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతాల వారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. ఏటా నియామకాలుంటాయి.
నేవీలో...
10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం: 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అభ్యసించవచ్చు. అనంతరం నేవీలోనే సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన స్కోర్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటన వెలువడుతుంది.
ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ: సెయిలర్‌-సీనియర్‌ సెకండరీ రిక్రూటర్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. పురుష అభ్యర్థులే అర్హులు. ఏడాదికి రెండు సార్లు ప్రకటన వెలువడుతుంది.
కోస్ట్‌ గార్డు: సముద్ర తీర రక్షణ దళంలో కోస్ట్‌ గార్డ్‌ నావిక్‌ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్‌ /10+2 ఎంపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఏడాదికి రెండు సార్లు ప్రకటన వెలువడుతుంది.
ఎయిర్‌ ఫోర్స్‌
గ్రూప్‌ ఎక్స్‌: ఎయిర్‌ ఫోర్స్‌లోని అన్ని టెక్నికల్‌ విభాగాల్లో పని చేయడానికి గ్రూప్‌-ఎక్స్‌ ఉద్యోగులను తీసుకుంటారు. ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులు గ్రూప్‌ ఎక్స్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వేలోనూ.. 
కమర్షియల్‌ క్లర్క్‌ కం టికెట్‌ క్లర్క్, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్, జూనియర్‌ టైం కీపర్, ట్రెయిన్స్‌ క్లర్క్‌ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండంచెల్లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ప్రకటనలు రెండు మూడేళ్లకు ఒకసారి వెలువడతాయి.
బైపీసీ గ్రూప్‌కి ప్రత్యేకం 
ఆర్మీ: సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ / టెక్‌ పోస్టులను ఆర్మీ భర్తీ చేస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17 1/2 - 23 ఏళ్లలోపు ఉండాలి. ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు.
ఎయిర్‌ ఫోర్స్‌: గ్రూప్‌ -వై మెడికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బైపీసీ గ్రూప్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఆంగ్లంలో 50 శాతం మార్కులుండాలి. వయసు 17-21 ఏళ్లలోపు ఉండాలి.
ఎస్‌ఎస్‌సీ: స్టెనోగ్రాఫర్స్‌
ఇంటర్‌ అర్హతతో స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తోంది. ఇందులో గ్రేడ్‌ సి, గ్రేడ్‌ డి పోస్టులుంటాయి. వీటికి ఎంపికైనవారు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్రానికి చెందిన సబార్డినేట్‌ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇంటర్‌ పూర్తిచేసిన ఏ గ్రూప్‌ విద్యార్థులైనా స్టెనోగ్రఫీ నేర్చుకుని వీటికి పోటీపడవచ్చు. స్టెనోగ్రఫీకి సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్‌ అవసరం లేదు. స్కిల్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
సోల్జర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌
ఆర్మీలో సోల్జర్‌ క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఇంగ్లిష్‌తోపాటు మ్యాథ్స్‌/ అకౌంట్స్‌/ బుక్‌ కీపింగ్‌ వీటిలో ఏదైనా సబ్జెక్టు చదివుండాలి. వయసు 17 1/2 - 23 ఏళ్లలోపు ఉండాలి. ఫిజికల్‌ టెస్టు, రాతపరీక్ష, వైద్యపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆయా ప్రాంతాల వారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల ద్వారా నియామకాలు చేపడతారు.
ఎయిర్‌మెన్‌ -నాన్‌టెక్నికల్‌
ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఏ గ్రూప్‌ వారైనా ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్‌-వై నాన్‌ టెక్నికల్‌ ట్రేడ్‌లో ఎయిర్‌మెన్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ టెస్టు, రాత పరీక్ష, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు జరుగుతాయి. ప్రకటన ఏటా వెలువడుతుంది.
Posted on 04.04.2019

ఇంటర్‌తో ఇవిగో ఉద్యోగాలు!
ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉన్నత ఉద్యోగాలను అందుకునే అవకాశం ఉంది. వీటి భర్తీ కోసం ఏటా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీలతోపాటు పలు ఇతర సంస్థలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్‌లో అన్ని గ్రూప్‌ల అభ్యర్థులూ, మరికొన్నిటికి కేవలం ఎంపీసీ వారు అర్హులు. వాటికి ఆయా ప్రకటనలు వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.
పెద్ద ఉద్యోగాలకు పెద్ద చదువులు చదవాలనే మాట కొంతవరకు వాస్తవం కావచ్చు. కానీ, ప్లస్‌టూతోనే చిన్నవయసులో మంచి ఉద్యోగాల్లో చేరి ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం మాత్రం ఉంది. అందులో కొన్ని సంస్థలు క్యాలెండర్‌ ప్రకారం పోస్టుల భర్తీని నిర్వహిస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకొని సన్నద్ధత ప్రారంభిస్తే ఉద్యోగ జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు.
ఆర్మీలో ఉన్నతాధికారి
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఆఫీసర్‌ ఉద్యోగాలకు యూపీఎస్సీ ఏడాదికి రెండుసార్లు ఎన్‌డీఏ ఖీ ఎన్‌ఏ రాతపరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్‌ అర్హతతో లభించే ఉన్నత స్థాయి ఉద్యోగం ఇదే. ఇందులోని ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవాళ్లు మూడేళ్లపాటు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో డిగ్రీ చదవాలి. వీరికి జేఎన్‌యూ న్యూదిల్లీ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుంది. అనంతరం ఏడాదిపాటు ఐఎంఏ డెహ్రాడూన్‌లో శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో ఆర్మీలోకి తీసుకుంటారు. ఆర్మీ వింగ్‌ (ఎన్డీఏ)కు బాలురు మాత్రమే అర్హులు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి.
కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకెండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌ / జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, పోస్టల్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులను సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేస్తారు. అభ్యర్థులను మూడు అంచెల్లో జరిగే పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఏటా ప్రకటన వెలువడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను గ్రూప్‌ -4 పరీక్షతో భర్తీ చేస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అవి: జనరల్‌ స్టడీస్‌, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌. ఎంపికైనవాళ్లు పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు, జిల్లా పరిషత్‌, కలెక్టరేట్‌, ఎమ్మార్వో కార్యాలయం, సచివాలయం మొదలైన చోట్ల విధులు నిర్వర్తిస్తారు. ఈ పరీక్షను రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు (ఏపీపీఎస్సీ / టీఎస్‌పీఎస్సీ)లు నిర్వహిస్తాయి.
సబార్డినేట్‌ సర్వీసుల్లో స్టెనోగ్రాఫర్లు
ఇంటర్‌ అర్హతతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగాలనూ భర్తీ చేస్తోంది. ఇందులో గ్రేడ్‌-సి, గ్రేడ్‌-డి పోస్టులు ఉంటాయి. వీటికి ఎంపికైనవాళ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్రానికి చెందిన సబార్డినేట్‌ ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు స్టెనోగ్రఫీ నేర్చుకుంటే వీటికి పోటీపడవచ్చు.
ఎంపీసీ వారికి ఎన్నో అవకాశాలు
ఎన్డీఏ: ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు ఎన్డీఏ ఖీ ఎన్‌ఏ పరీక్షతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఆఫీసర్‌ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆఫీసర్‌ హోదాతో ఉద్యోగంలో చేరవచ్చు. యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఎన్‌డీఏతో ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కూడా కావచ్చు.
నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీం: ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా కేరళ ఎజిమాలలోని నేవల్‌ అకాడెమీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అభ్యసించవచ్చు. అనంతరం నేవీలోనే సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో విధులు కొనసాగించవచ్చు. జేఈఈ మెయిన్స్‌ లో సాధించిన స్కోర్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ: ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో అర్హత సాధించాలి. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి బీటెక్‌ చదువుతోపాటు శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి.
నేవీ: భారతీయ నావికాదళం సైలర్‌-సీనియర్‌ సెకెండరీ రిక్రూటర్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఈ రెండు పోస్టులకూ కేవలం పురుష అభ్యర్థులే అర్హులు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్‌/ ట్రేడ్ల్లో ఏదైనా నేవీ కేంద్రంలో తర్వాత దశ ట్రెయినింగ్‌ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.14600 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన వారికి రూ.21,700- రూ.69,100 వేతన శ్రేణితో జీతం లభిస్తుంది. దీంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే రూ.5200, గ్రూప్‌-ఎక్స్‌ పే రూ.6200 (ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని ప్రారంభంలోనే రూ.40 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. సైలర్‌/ఏఏగా విధుల్లో చేరినవారు మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ (సుబేదార్‌) హోదా వరకు చేరుకోవచ్చు.
ఎయిర్‌ ఫోర్స్‌: గ్రూప్‌-ఎక్స్‌, గ్రూప్‌-వై పోస్టులకు ఎయిర్‌ ఫోర్స్‌ నియామకాలను చేపడుతోంది. ఎక్స్‌ విభాగానికి ఎంపికైనవాళ్లు టెక్నికల్‌ ట్రేడ్‌ల్లోనూ, వైలో ఎంపికైనవాళ్లు మెడికల్‌ ట్రేడ్‌ల్లో విధులు నిర్వర్తిస్తారు. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైనవారు ఈ గ్రూప్‌ ఎక్స్‌, వై విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీ: సోల్జర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ టెక్నికల్‌ (ఏవియేషన్‌ అండ్‌ ఎమ్యునిషన్‌ ఎగ్జామినర్‌) పోస్టులకు ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 17 1/2 - 23 ఏళ్లలోపు ఉండాలి.
సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఫైర్‌: సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) ఫైర్‌ క్యాడర్‌లో కానిస్టేబుల్‌ పోస్టులకు సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు పోటీపడవచ్చు. పీఎస్టీ, పీఈటీ, రాతపరీక్ష, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎత్తు కనీసం 170 సెం.మీ. ఉండాలి. పీఎస్టీ, పీఈటీ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే రాతపరీక్షకు అనుమతిస్తారు. వంద మార్కులకు రాతపరీక్షను నిర్వహిస్తారు.
ఎయిర్‌ ఫోర్స్‌
ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే గ్రూప్‌-వై నాన్‌-టెక్నికల్‌ ట్రేడ్‌లో ఎయిర్‌మెన్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు, రాతపరీక్ష, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. గ్రూప్‌-వైలో ఆటోమొబైల్‌ టెక్నీషియన్‌, గ్రౌండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌ పోస్టులకు ఇంటర్‌లో అన్ని గ్రూప్‌ల వారూ అర్హులే.
రైల్వే
జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌ పోస్టులను ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తారు. రెండంచెల్లో నిర్వహించే రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు.
రక్షణ బాధ్యతలు
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్‌ పోస్టులను ఇంటర్‌ అర్హతతో భర్తీ చేస్తుంది. వీటిలో సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, ఎస్‌పీఎఫ్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖలో వార్డర్స్‌ మొదలైన పోస్టులు ఉంటాయి. మొదట ప్రిలిమ్స్‌ నిర్వహించి ఇందులో అర్హత సాధించినవారికి దేహదార్ఢ్య పరీక్ష తరువాత ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్ష జరుపుతారు. చివరగా మెయిన్స్‌ నిర్వహించి అందులో పొందిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
గ్రామస్థాయి అధికారి
విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్‌ఓ) పోస్టులను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల ద్వారా భర్తీ చేస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
క్లర్కులు, స్టోర్‌ కీపర్లు
ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ 60 శాతం మార్కులతో పాసైనవాళ్లు ఆర్మీలో సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపింగ్‌ టెక్నికల్‌ పోస్టులకు అర్హులు. ఇంటర్‌లో ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 50 శాతం మార్కులు రావాలనే నిబంధన కూడా ఉంది. వయసు పరిమితి 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. ఆయా ప్రాంతాలవారీగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించి నియామకాలు చేపడతారు.
అడవిలో ఆఫీసర్‌ 
అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ఇంటర్‌ అర్హతతో ఉంటాయి. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందు నడక పరీక్ష పెడతారు. ఇందులో భాగంగా పురుషులైతే 25 కి.మీ., మహిళలు 16 కి.మీ. దూరాన్ని 4 గంటల్లో పూర్తిచేయాలి. ఇలా విజయవంతంగా నడక పూర్తిచేసినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పేపర్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌, పేపర్‌-2లో జనరల్‌ మ్యాథ్స్‌ నుంచి పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
చిన్న వయసులోనే పెద్ద జీతాలు!ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కొన్ని విభాగాలు, బ్యాంకులు పలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు ఉన్నత విద్యను అందించడంతోపాటు ఉద్యోగాల్లో కూడా చేర్చుకుంటున్నాయి. చిన్నవయసులోనే పెద్ద జీతాలు వచ్చే ఈ ఉద్యోగాల్లో చేరితే అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు వరమనే చెప్పాలి.
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు అందించే సంస్థల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, త్రివిధ దళాలు, పోస్టల్ శాఖ, అటవీశాఖ, పోలీస్ బోర్డులను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటిలో కొన్ని ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తుంటే, మరికొన్ని వాటి అవసరాలను అనుసరించి ప్రకటనలు వెలువరిస్తున్నాయి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ అభ్యర్థులకు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో క్లరికల్ స్థాయి ఉద్యోగాల భర్తీకి 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్' నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), స్టోర్స్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది.
ఎంపిక: టైర్-1 పేరుతో మొదట రాత పరీక్ష అందరికీ జరుగుతుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-2లో...
1) డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కంప్యూటర్‌పై స్కిల్ టెస్ట్ ఉంటుంది.
2) లోయర్ డివిజన్ క్లర్కులకు టైపింగ్ టెస్టు ఉంటుంది.
టైర్-1లో కనీస అర్హత మార్కులు సాధించాలి. తర్వాతే స్కిల్ టెస్టు నిర్వహిస్తారు.
వీటిలో విజయం సాధిస్తే చాలు. ఇంటర్వ్యూలు ఉండవు. నేరుగా నియామకం ఉత్తర్వులను అందుకుంటారు.
వెబ్‌సైట్: http://ssc.nic.in
పోస్టల్ డిపార్ట్‌మెంట్ 
భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ హోదా ఉద్యోగాలను అందిస్తోంది. అవి..
1) పోస్టల్ అసిస్టెంట్లు
2) సార్టింగ్ అసిస్టెంట్లు
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కనీస విద్యార్హత. టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్) 100 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ టెస్టులో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు లెక్కిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఖాళీలు ఏర్పడినప్పుడు ప్రకటనలు వస్తుంటాయి.
వెబ్‌సైట్: www.indianpost.gov.in
స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్
భారతీయ రైల్వేల్లో మెకానికల్ విభాగంలో స్పెషల్ క్లాస్ అప్రెంటీస్ సిబ్బంది నియామకానికి సంబంధించిందే 'స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్'. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొందిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా దేహదారుఢ్య ప్రమాణాలను నిర్దేశిస్తారు.
ఎంపిక: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశ వ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. దీన్లో పార్ట్ -1, పార్ట్ -2 ఉంటాయి.
* పార్ట్-1 లో జనరల్ నాలెడ్జ్, సైకాలజీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి.
* పార్ట్ -2 పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించింది.
శిక్షణ: అర్హులైన వారికి 4 సంవత్సరాలు మెకానికల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇస్తారు. రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)తో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఈ శిక్షణ ఉంటుంది. సమర్ధంగా శిక్షణ పూర్తిచేసిన వారికి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీని అందజేస్తారు. తర్వాత రైల్వేలోని మెకానికల్ విభాగంలో మెకానికల్ ఇంజినీర్లుగా నియమిస్తారు.
వెబ్‌సైట్: http://www.upsc.gov.in
రైల్వేలు
భారతీయ రైల్వే వ్యవస్థ మన దేశంలో ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది. వీటిలో నాన్- టెక్నికల్/ టెక్నికల్ విభాగాలు ఉంటున్నాయి. ఇంటర్ అర్హతతో నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలను పొందవచ్చు. వీటిలో కమర్షియల్ క్లర్క్, గూడ్స్ గార్డ్ మొదలైనవి ఉంటున్నాయి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దీన్లో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అరిథ్‌మెటిక్ విభాగాలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఉండదు.
వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in/
త్రివిధ దళాలు
దేశ రక్షణ బాధ్యత వహించే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఏటా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ...
ఎన్‌డీఏ అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో చేరేందుకు, ఇండియన్ నావెల్ అకాడమీ నిర్వహించే శిక్షణ కోర్సులో చేరేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా 'ఎన్‌డీఏ అండ్ నావెల్ అకాడమీ' పరీక్షను నిర్వహిస్తోంది.ఈ పరీక్ష ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది.
అర్హతలు: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరిధిలోని ఆర్మీ వింగ్‌కు ఇంటర్‌లో ఏ గ్రూపు పూర్తి చేసిన వారైనా అర్హులే.
2) నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన నావెల్ వింగ్స్, ఎయిర్‌ఫోర్స్‌తోపాటు ఇండియన్ నావెల్ అకాడమీకీ
* చెందిన 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో చేరేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్థులై ఉండాలి. వయసు 161/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ఎంపిక నిమిత్తం ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు జరుగుతాయి. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
* పేపర్ -1 మ్యాథమేటిక్స్‌కు సంబంధించింది.
* పేపర్ -2 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌కు సంబంధించింది.
* రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ఉంటుంది.
శిక్షణ: అన్ని పరీక్షలో అర్హులైన వారిని శిక్షణ కోర్సుకు ఎంపిక చేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏ విభాగానికి ఎంపికైనా అందరికీ పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకేరకమైన శిక్షణ ఇస్తారు. ఇక్కడ తమ ట్రేడ్‌లకు చెందిన శిక్షణ కూడా అందిస్తారు. అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్నిబట్టి బీఏ, బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. నావెల్ అకాడమీకి చెందిన 10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తారు. తర్వాత...
1) ఆర్మీ క్యాడెట్‌లకు ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
2) నావెల్ అకాడమీకి ఎంపికైన నావీ విభాగం వారికి ఎజిమలైలోని ఇండియన్ నావెల్ అకాడమీలో సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత వీరికి సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు.
3) నావెల్ అకాడమీకి చెందిన 10+2 క్యాడెంట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీ ప్రదానం, శిక్షణ తర్వాత 'ఎగ్జిక్యూటివ్ లేదా టెక్నికల్' బ్రాంచీల్లో ఇంజినీర్లుగా నియమిస్తారు.
4) ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్‌లకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇది ఏడాదిన్నరపాటు ఉంటుంది. తర్వాత వీరికి ఫ్లయింగ్ ఆఫీసర్ హోదా ఇస్తారు.
వెబ్‌సైట్: http://www.upsc.gov.in.రక్షణ మంత్రిత్వ శాఖలో టెలిఫోన్ ఆపరేటర్లు
రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్ విద్యార్హతతో టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీచేస్తోంది.
ఈ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక నిమిత్తం రాత పరీక్ష నిర్వహిస్తారు. నోటిఫికేషన్లు ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్, దినపత్రికల్లో వస్తుంటాయి. దరఖాస్తులను ఎక్కడి పంపాలనేది ప్రకటనలో పేర్కొంటారు.
ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మన్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'ఎయిర్‌మన్' ఉద్యోగాలకు తరచూ ప్రకటనలు వస్తుంటాయి. దీన్లో గ్రూప్ 'ఎక్స్' (టెక్నికల్), గ్రూప్ 'వై' (ఆటో టెక్నీషియన్, గ్రౌండ్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (పోలీస్) ట్రేడ్‌లు ఉంటాయి. ఎంపిక నిమిత్తం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
1) గ్రూప్ 'ఎక్స్' (టెక్నికల్) ట్రేడ్‌లకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
2) గ్రూప్ 'వై' (ఆటో టెక్, జీటీఐ, ఐఏఎఫ్ (పి) ట్రేడ్‌లకు): ఇంటర్ ఏ గ్రూప్ చదివినా కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య.
* అర్హులైన వారికి ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో ఉత్తీర్ణత సాధించిన వారికి దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి.
వెబ్‌సైట్: www.careerairforce.nic.in
క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్
ఇండియన్ నేవీ విభాగం ఇంటర్ అభ్యర్థులకు పర్మనెంట్ కమిషన్ కింద 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్ ద్వారా ఉద్యోగాలను ఇస్తోంది. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
అర్హతలు: ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులతో కనీసం 70 శాతం మార్కులు. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు 157 సెం.మీ.లు ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా దేహ దారుఢ్య ప్రమాణాలను నిర్దేశిస్తారు.
ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డు అర్హులైన వారికి 5 రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇవి రెండు దశల్లో జరుగుతాయి.
* స్టేజ్-1 (ఒక్క రోజు మాత్రమే)లో ఇంటెలిజెన్స్ టెస్టులు, పిక్చర్ పర్సెప్షన్ టెస్టులు ఉంటాయి. దీన్లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 (4 రోజులు) టెస్టులు నిర్వహిస్తారు. ఇక్కడ సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి.
* అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన వారిని క్యాడెట్‌లుగా తీసుకుని బీటెక్ ( ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్) కోర్సులో శిక్షణ ఇస్తారు.
* కాలవ్యవధి 4 సంవత్సరాలు. కోర్సు పూర్తయిన తర్వాత వీరికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. శిక్షణ పూర్తిచేసిన వారిని 'ఎగ్జిక్యూటివ్ లేదా టెక్నికల్' (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా నావెల్ ఆర్కిటెక్ట్) బ్రాంచీల్లో నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
ఏవియేషన్ కేడర్ అబ్జర్వర్
భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఏవియేషన్ కేడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 'అబ్జర్వర్‌'గా (షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్) నియామకాలు చేపడుతుంటుంది.
అవివాహితులైన స్త్రీ, పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన వారిని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రెండు దశల్లో ఎంపిక చేస్తుంది. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆఫీసర్లుగా సబ్-లెఫ్టినెంట్ హోదాలోశిక్షణ ఇస్తారు.
* శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారిని సబ్- లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
సెయిలర్లు
భారత నౌకాదళం ఇంటర్ అర్హతతో 'సెయిలర్‌'గా చేరేందుకు తరచూ ప్రకటనలు ఇస్తుంటుంది. వీటికి అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్స్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని చదివి ఉండాలి. 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. అవసరం.
ఎంపిక: అర్హులైన వారికి మొదట ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శిక్షణ ఇస్తారు. తర్వాత సెయిలర్లుగా నియమిస్తారు.
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
పోలీస్ కానిస్టేబుళ్లు
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇంటర్‌లో ఉత్తీర్ణులైన వారికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. పోస్టుల వివరాలు...
1) స్త్టెపెండరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుళ్లు (సివిల్ - పురుషులు)
2) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (ఏఆర్ పురుషులు).
3) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (సివిల్ - మహిళలు)
4) ఎస్‌సీటీ పోలీస్ కానిస్టేబుళ్లు (ఏఆర్ మహిళలు).
అర్హతలు: ఇంటర్ ఏ గ్రూప్ ఉత్తీర్ణులైన వారైనా దరఖాస్తు చేయవచ్చు. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 167.6 సెం.మీ. ఎత్తు, మహిళలు 157.5 సెం.మీ. ఎత్తుఉండాలి.
అటవీ శాఖ
అటవీశాఖ ఇంటర్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

1 comment:

  1. Your article is amazingly smart. I love to (look at web sites on) your diary's posts every day and that I got huge help from your (shared online writing page) and developed a replacement app fmovies app you'll check.Thanks for the wonderful diary.

    ReplyDelete