June 05, 2020

వారిద్దరూ హెచ్‌ఐవీ పెషంట్లు.

వారిద్దరూ హెచ్‌ఐవీ పెషంట్లు. కౌన్సెలింగ్ నిమిత్తం నెలలో రెండు మూడు కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సమన్వయం కుదరడం.. అధికారుల జోక్యం.. వెరసి.. మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమోగానీ పెళ్లి అయిన వారం రోజులకే భర్త ముఖం చాటేయడంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన మహబూబ్ నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీతో బాధపడుతున్నారు. నెలలో రెండుమూడు సార్లు మహబూబ్ నగర్‌లోని కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చేవాడు. ఇదే క్రమంలో మహబూబ్ నగర్‌కు చెందిన ఓ యువతి సైతం కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లేది. ఈ క్రమంలో వీరిద్దరిని కౌన్సెలింగ్ కేంద్రం సిబ్బంది సమన్వయం కుదిర్చి ఫిబ్రవరి ఒకటో తేదీన వివాహం జరిపించారు. భార్యభర్తలిద్దరూ వారం రోజుల పాటు బాగానే కాపురం చేశారు. ఆ తర్వాత ఏమైందో గానీ ఓ రోజు భర్త సినిమాకు వెళ్తునానంటూ బయటకు వెళ్లాడు. మూడు నెలలైనా ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అత్తారింటి ఎదుట ఆందోళనకు దిగింది.

No comments:

Post a Comment